భరితెగించిన గుంటూరు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం

*గుంటూరులో ప్రైవేటు ఆస్పత్రులు బరితెగించాయి. డబ్బులు కోసం కొందరు వైద్యులు వైద్య వృత్తికే చెడ్డ పేరు తెస్తున్నారు.*

*అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు. రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నారు.* 

*రోగుల ప్రాణాలకంటే డబ్బే పరమవధిగా భావిస్తున్నారు. ఇలా గుంటూరులో చాలా ఆస్పత్రుల్లో నిండు గర్భిణీలను మోసం చేస్తున్నారు*. 

*నార్మల్ డెలివరీ చేయకుండా డబ్బుల కోసం సిజేరియన్స్ చేస్తున్నారు.*

*డీఎంహెచ్‌వో విజయలక్ష్మి తనిఖీల్లో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.*

 *గుంటూరులో 99 ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా సిజేరియన్లు చేశారు. ఒక్కో కాన్పుకు రూ. 70 వేల నుంచి లక్షకు పైగా బిల్లులు వసూలు చేశారు..*

*దీంతో ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నారు...*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది