సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.
ఉదయం 11.45 గంటలకు అక్కడకు చేరుకుని 1.30 గంటల వరకు ప్రాజెక్టులోని వివిధ భాగాలను పరిశీలించనున్నారు.
మధ్యాహ్నం 2.05 నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్ష నిర్వహిస్తారు.
అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
సీఎం రాక దృష్ట్యా చేయాల్సిన ఏర్పాట్లపై జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు.
Tags
AP News