ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన




 
 ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
 
తెలంగాణ : సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీలో రూ.362 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మద్దులపల్లిలో వ్యవసాయ మార్కెట్‌ యార్డు, నర్సింగ్‌ కాలేజీని సీఎం ప్రారంభించారు. జేఎన్‌టీయూ కళాశాల, మున్నేరు-పాలేరు లింక్‌ కెనాల్‌, కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది