పదవీకాలం పొడిగించమని బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. 2023లో బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. గత మూడేళ్లలో నాలుగు ఐసీసీ ఫైనల్స్ కు చేరగా అందులో మూడు సార్లు(టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 వరల్డ్ కప్ 2026) విజేతగా నిలిచింది.
ఈవిజయాల నేపథ్యం లోనే ఆయన తన సేవలను కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు
తెలుస్తోంది.
Tags
sports